కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ (90) అనారోగ్యంతో కన్నుమూశారు. మహారాష్ట్ర లాతూర్లోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన 1980 నుంచి 2004 వరకు వరుసగా ఏడుసార్లు లోక్సభ ఎంపీగా విజయం సాధించారు. 1935, అక్టోబర్ 12న జన్మించిన పాటిల్.. లాతూర్ మున్సిపల్ కౌన్సిల్ చీఫ్ గా ఎన్నికై రాజకీయాల్లో ప్రవేశించారు. 70వ దశకం తొలినాళ్లలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం లోక్సభ ఎంపీగా గెలుపొందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa