AP: భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తుండగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో బస్సు లోయలో పడి పలువురు యాత్రికులు మృతి చెందడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటన బాధాకరమని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాగా, ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa