బ్రిటన్లోని బ్రిస్టల్ నగరంలో ఉన్న ఒక మ్యూజియంలో భారీ దొంగతనం జరిగింది. దుండగులు 600కు పైగా అత్యంత విలువైన వస్తువులను అపహరించారు. వాటిలో బ్రిటిష్ కాలంనాటి భారతీయ కళాఖండాలు కూడా ఉండటం గమనార్హం. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి, ప్రజల సహాయం కోరుతున్నారు.బ్రిస్టల్లోని బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ మ్యూజియంలో సెప్టెంబర్ 25న తెల్లవారుజామున 1 నుంచి 2 గంటల మధ్య ఈ చోరీ జరిగింది. గల్లంతైన వస్తువులలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారికి చెందిన నడుము పట్టీ బకిల్, దంతంతో చేసిన బుద్ధుడి విగ్రహం వంటి అమూల్యమైన భారతీయ వస్తువులు ఉన్నాయి. ఈ కళాఖండాలు బ్రిటిష్ చరిత్రకు సంబంధించిన కీలక ఆధారాలని అధికారులు తెలిపారు.ఈ ఘటనపై ఎవాన్ అండ్ సోమర్సెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa