ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాత్రి పడుకునేముందు,,,,,అందమైన ముఖం కోసం అద్భుతమైన చిట్కా

Life style |  Suryaa Desk  | Published : Sat, Dec 13, 2025, 10:55 PM

జయా కిషోరి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలిసి ఉండకపోవచ్చు. కానీ, ఈమెకి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆధ్యాత్మిక ప్రయాణంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు జయా కిషోరి. భక్తి పాటలు, ఆధ్యాత్మిక ప్రసంగాలతో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. 20కి పైగా ఆధ్యాత్మిక ఆల్బమ్స్ ఆలపించారు జయా కిషోరి.


రామాయణ, మహాభారత, భగవద్గీతల నుంచి మంచి ఉదహరణలతో వ్యక్తిత్వ పాఠాలు కూడా బోధిస్తారు. జయా కిషోరికి ఎంత ఫాలోయింగ్ ఉందంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో కోటికి పైగా ఆమెను ఫాలో అవుతున్నారు. ఇక, జయా కిషోరి అందానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె ముఖం నిండు చందమామలా మెరిసిపోతుంది. మచ్చల్లేని అందమైన ముఖం ఆమె సొంతం.


తన బ్యూటీ సీక్రెట్‌ను జయా కిషోరి పంచుకున్నారు. అమ్మమ్మల కాలం నాటి ఈ చిట్కా వల్ల నల్ల మచ్చలు తగ్గడంతో పాటు మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. ఈ చిట్కా పాటించడం కూడా చాలా సులభం. ఈ చిట్కాకు మూడంటే మూడు పదార్థాలు చాలు. ఇవి మన వంట గదిలోనే దొరుకుతాయి. ఇంతకీ ఆ చిట్కా ఏంటి, దానిని ఎలా ఫాలో అవ్వాలో ఇప్పుడు చుద్దాం.


కావాల్సిన పదార్థాలు


కావాల్సిన పదార్థాలు


​పెరుగు - రెండు టీస్పూన్లు


శనగపిండి - రెండు టీస్పూన్లు


పసుపు - చిటికెడు


ఫేస్‌ప్యాక్ తయారీ, వాడే విధానం


ఫేస్‌ప్యాక్ తయారీ, వాడే విధానం


జయా కిషోరి.. సజెస్ట్ చేసిన ఫేస్ ప్యాక్ కోసం మూడంటే మూడు పదార్థాలు చాలు. ముందుగా పెరుగును ఒక గిన్నెలో తీసుకుని..దానికి రెండు టీస్పూన్ల శనగపిండి, చిటికెడు పసుపు కలుపుకోవాలి. ఈ మూడింటిని బాగా కలుపుకుని చిక్కటి పేస్టులా చేసుకోవాలి.


స్క్రబ్ లాంటి ప్యాక్ తయారుచేసుకోండి. పడుకునే గంట ముందు ఈ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసుకోండి. ఆరిన తర్వాత దానిని గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఈ ప్యాక్‌ని వారానికి రెండు నుంచి మూడు సార్లు అప్లై చేయవచ్చు. ఇది చర్మానికి హాని కలిగించదు.


సెలబ్రిటీ చెప్పిన చిట్కా


ప్రయోజనాలు ఏంటి?


​పెరుగు: మీ ముఖానికి పెరుగు అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా, హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మచ్చల్ని వదిలించుకోవడానికి సాయపడుతుంది. పెరుగు నల్ల మచ్చలు, టానింగ్, ముడతల్ని దూరం చేయడానికి సాయపడుతుంది.


శనగపిండి: శనగపిండి చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. శనగపిండి చర్మానికి తక్షణ మెరుపు అందిస్తుంది. శనగపిండితో మొటిమలు, మచ్చలు తొలగించవచ్చు. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.


పసుపు: పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ముఖ వాపును తగ్గిస్తుంది, ముడతల్ని తగ్గించడానికి సాయపడుతుంది. పసుపును ఉపయోగించడం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. సూర్యరశ్మి నుంచి రక్షణ లభిస్తుంది.


ఈ విషయాల్ని గుర్తించుకోండి


కొందరికి శనగపిండి, పసుపు, పెరుగు పడకపోవచ్చు. అందుకే ఈ ప్యాక్ అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. దురద, అలెర్జీ వంటి సమస్యలు వస్తే దీన్ని అప్లై చేసుకోకండి. ఈ ప్యాక్‌ను చేయడం చాలా సులభం. అందుకే దీన్ని అప్లై చేసుకునేముందు రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రిజ్‌లో పెట్టడం లాంటి పనులు చేయకండి.


ఈ చిట్కాలు కూడా పాటించండి


చలికాలంలో ఎక్కువగా నీరు తాగడం మర్చిపోవద్దు. దాహం వేయడం లేదని నీళ్లు తక్కువ తాగితే.. చర్మం పొడి బారుతుంది. అంతేకాకుండా నల్ల మచ్చలు, ముడతలు వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే కనీసం రోజుకు ఏడు నుంచి ఎనిమిది లీటర్ల నీరు తాగాలని నిపుణులు సిఫార్స్ చేస్తున్నారు.


అంతేకాకుండా సమతుల్య ఆహారం తీసుకోండి. చక్కెర ఎక్కువగా ఉండే ఫుడ్స్, పానీయాలకు దూరంగా ఉండండి. తాజా పండ్లు, కూరగాయలు తినండి. బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్ అప్లై చేసుకోండి. పైన చెప్పిన ప్యాక్‌తో పాటు ఈ చిట్కాలు పాటిస్తే మీ ముఖం మెరిసిపోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa