ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మిగనూరులో ఒంగోలు ఎద్దుల బలప్రదర్శన ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 06, 2026, 05:16 PM

ఎమ్మిగనూరు పట్టణంలో శ్రీనీలకంఠేశ్వరస్వామి జాతర సందర్భంగా, మంగళవారం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి దివంగత బీవీ మోహన్ రెడ్డి జ్ఞాపకార్థం ఒంగోలు ఎద్దుల బలప్రదర్శన పోటీలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒంగోలు సహా వివిధ ప్రాంతాల ఉత్తమ జాతి ఎద్దులు పాల్గొన్న ఈ పోటీలను ప్రజలు పెద్ద సంఖ్యలో వీక్షించారు. రైతులు దేశానికి వెన్నెముకలని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, పశుపోషకులు, నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa