ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజస్థాన్‌లోని గవర్నమెంట్ స్కూల్స్‌లో వార్తాపత్రికల పఠనం తప్పనిసరి చేసిన ప్రభుత్వం

national |  Suryaa Desk  | Published : Tue, Jan 06, 2026, 06:00 PM

విద్యార్థుల్లో పఠనాసక్తి, లోకజ్ఞానం పెంపొందించేందుకు రాజస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజూ వార్తాపత్రికల పఠనం తప్పనిసరి చేసింది. ఉదయం అసెంబ్లీలో కనీసం 10 నిమిషాలు విద్యార్థులు వార్తలు చదవాలని ఉత్తర్వులు జారీ చేసింది. తరగతుల వారీగా జాతీయ, అంతర్జాతీయ, క్రీడా వార్తలు, సంపాదకీయాలు చదివించనున్నారు. పత్రికల చందా ఖర్చును పాఠశాల విద్యామండలే భరించనుంది. కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పటికే ఇదే విధానం అమల్లో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa