ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్ పరీక్షలలో కీలక నిర్ణయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 06, 2026, 06:17 PM

ఏపీలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, పబ్లిక్ పరీక్షల నిర్వహణపై విద్యా మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా ఆదేశించారు. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు రెండు విడతలుగా ఈ ప్రాక్టికల్స్ జరగనున్నాయి.పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను నేరుగా బోర్డు కార్యాలయానికి అనుసంధానం చేయాలని, దీనివల్ల పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత సాధ్యమవుతుందని రంజిత్ బాషా తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 45 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేకంగా సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసి, వాటిని రాష్ట్ర కార్యాలయం నుంచే నిరంతరం పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు.ఇటీవల పబ్లిక్‌ పరీక్షలు, ఇంటర్ విద్యలో చేపడుతున్న కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈసారి ఇంటర్ మొదటి ఏడాది పరీక్షల విధానంలో కొన్ని మార్పులు ప్రవేశపెట్టినట్లు రంజిత్ బాషా వివరించారు. ఈ మార్పులపై పరీక్షా కేంద్రాల సిబ్బంది, అధికారులు సంపూర్ణ అవగాహనతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరగనున్న పబ్లిక్ పరీక్షలతో పాటు ప్రాక్టికల్స్‌ను కూడా అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకే ఈ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. సీసీ కెమెరాల నిఘా నేపథ్యంలో ఎలాంటి అక్రమాలకు ఆస్కారం ఉండదని అధికారులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa