ఫిబ్రవరి 7 నుంచి ఇండియా, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న T20 వరల్డ్ కప్ 2026 కోసం ఇటలీ క్రికెట్ బోర్డు ఆదివారం (జనవరి 18) తమ 15 సభ్యుల జట్టును అధికారంగా ప్రకటించింది.జట్టుకు వేన్ మాడ్సెన్ నాయకత్వం వహించనున్నారు. ఇది ఇటలీకి తొలి టీ20 ప్రపంచ కప్. జట్టులో ప్రత్యేకంగా చెప్పదగ్గ విషయం ఏమిటంటే, సౌతాఫ్రికా మాజీ ఆటగాడు జెజె స్మట్స్ స్థానాన్ని సంపాదించుకున్నాడు. స్మట్స్ సౌతాఫ్రికా తరపున 6 వన్డేలు, 13 టీ20 మ్యాచ్లు ఆడాడు. 2021లో చివరిసారిగా సౌతాఫ్రికా జట్టులో ఆడిన స్మట్స్, ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో నిలకడగా ఉండలేకపోయాడు.అయితే, స్మట్స్ కు ఇటలీ వారసత్వ హక్కు ఉన్న కారణంగా ఆయన ఈ జాతీయ టీ20 జట్టులో చోటు పొందాడు. క్వాలిఫయర్స్ సమయంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జో బర్న్స్ ఇటలీ జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే, గత సంవత్సరం చివర్లో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడిని జట్టులోంచి తప్పించారు.జట్టులో హ్యారీ మానెంటి, బెంజమిన్ మానెంటి సోదరులు, అలాగే ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా సోదరులు కూడా ఉన్నారు. జాన్ డేవిసన్ ప్రధాన కోచ్గా జట్టుకు మార్గనిర్దేశనం అందిస్తారు. అసిస్టెంట్ కోచ్లుగా కెవిన్ ఓ’బ్రియన్, డగ్లస్ బ్రౌన్ బాధ్యతలు స్వీకరిస్తారు.
*ఇటలీ గ్రూప్ షెడ్యూల్:ఇటలీ ఈసారి గ్రూప్ సిలోలో ఉంది. ఈ గ్రూప్లో బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, నేపాల్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి.
ఫిబ్రవరి 9 – కోల్కతాలో బంగ్లాదేశ్తో
ఫిబ్రవరి 12 – ముంబైలో నేపాల్తో
ఫిబ్రవరి 16 – ఇంగ్లాండ్తో
ఫిబ్రవరి 19 – వెస్టిండీస్తో
*ఇటలీ 15 సభ్యుల జట్టు:వేన్ మాడ్సెన్ (కెప్టెన్), మార్కస్ కాంపోపియానో, జియాన్ పియరో మీడే, జైన్ అలీ, అలీ హసన్, క్రిషన్ జార్జ్, హ్యారీ మానెంటి, ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా, సయ్యద్ నఖ్వీ, బెంజమిన్ మానెంటి, జస్ప్రీత్ సింగ్, జెజె స్మట్స్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకా.
-T20 వరల్డ్ కప్కు అర్హత సాధించిన 20 జట్లు:భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, యూఎస్ఏ, వెస్టిండీస్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, జింబాబ్వే, నమీబియా, ఒమన్, నేపాల్, యూఏఈ
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa