ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌ నిరాశ: కోహ్లీ మాత్రం ఒంటరి పోరాటంలో నిలిచాడు

sports |  Suryaa Desk  | Published : Sun, Jan 18, 2026, 09:08 PM

మూడు వన్డే సిరీస్‌లో భాగంగా హోల్కర్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో టీం ఇండియా లక్ష్య ఛేదనలో తడబడింది. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నప్పటి తర్వాత, కివీస్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు సాధించింది.భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీం ఇండియాలో రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు, కేవలం 11 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ 23 పరుగుల వద్ద, శ్రేయస్ అయ్యర్ 3, కెఎల్ రాహుల్ 1 పరుగుతో ఔటయ్యారు. ఈ సమయంలో క్రీజ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, నితీశ్ కుమార్ రెడ్డి జతగా స్కోర్ పెంచేందుకు ప్రయత్నించారు.కోహ్లీ-నితీశ్ జోడీ 88 పరుగుల Partnership ఏర్పాటు చేసి ఇద్దరూ అర్థ శతకాలను సాధించగలిగారు. అయితే, 53 పరుగుల వద్ద నితీశ్ క్లార్క్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 30 ఓవర్లకు భారత్ 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. క్రీజ్‌లో కోహ్లీ 69, జడేజా 7 పరుగులతో కొనసాగుతున్నారు. మ్యాచ్ విజయం సాధించేందుకు భారత్‌కు ఇంకా 169 పరుగులు అవసరం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa