న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో 2 - 1 తేడాతో పరాజయం ఎదురైన నేపథ్యంలో మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ , సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దేశవాళీ క్రికెట్కు తిరిగివెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రిక్బజ్ కథనం ప్రకారం చివరి నిమిషంలో ఎలాంటి మార్పులు జరగకపోతే, రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఇద్దరూ ఆడే అవకాశం ఉంది.
ప్రస్తుతం భారత జట్టు దృష్టి న్యూజిలాండ్తో జరిగే ఐదు టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్, అలాగే 2026 టీ20 వరల్డ్కప్పై ఉంది. అయితే గిల్, జడేజాలకు వెంటనే ఎలాంటి అంతర్జాతీయ బాధ్యతలు లేకపోవడంతో, వచ్చే రంజీ ట్రోఫీ రౌండ్కు వారు అందుబాటులో ఉన్నారు. జడేజా ఇప్పటికే టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలకగా, గిల్ను టీ20 సిరీస్కు ఎంపిక చేయలేదు.
క్రిక్బజ్ సమాచారం ప్రకారం.. రవీంద్ర జడేజా జనవరి 22 నుంచి రాజ్కోట్లో ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ మ్యాచ్లో సౌరాష్ట్ర జట్టు తరఫున పంజాబ్పై ఆడే అవకాశం ఉంది. ఇదే మ్యాచ్లో శుభ్మన్ గిల్ కూడా పాల్గొనే అవకాశాలు బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. “న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ముగిసిన వెంటనే జడేజా ఆడనున్నట్లు తెలిసింది. గిల్ కూడా రాజ్కోట్కు వెళ్లే అవకాశం ఉంది, అయితే తుది నిర్ణయం చివరి నిమిషంలో తీసుకుంటారు” అని ఆ కథనం పేర్కొంది.
గిల్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క రంజీ ట్రోఫీ మ్యాచ్ కూడా ఆడలేదు. అతని చివరి రంజీ మ్యాచ్ గత సీజన్లో కర్ణాటకపై జరిగింది. జడేజా మాత్రం ఈ సీజన్లో ఒక మ్యాచ్ మాత్రమే ఆడి, మధ్యప్రదేశ్పై సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగాడు. ఎలైట్ గ్రూప్లో సౌరాష్ట్ర, పంజాబ్ జట్లు ప్రస్తుతం దిగువ భాగంలో ఉన్నాయి. సౌరాష్ట్ర ఐదు మ్యాచ్ల్లో ఒక విజయం, నాలుగు డ్రాలతో నాలుగో స్థానంలో ఉండగా, పంజాబ్ ఒక విజయం, ఒక ఓటమితో ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ తర్వాత రెండు జట్లకూ ఇంకా ఒక లీగ్ మ్యాచ్ మిగిలి ఉంది.
న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో గిల్, జడేజా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. గిల్ మూడు ఇన్నింగ్స్ల్లో కలిపి 135 పరుగులు మాత్రమే చేయగా.. చివరి వన్డేలో 23 పరుగులకే అవుటయ్యాడు. జడేజా మాత్రం సిరీస్ మొత్తం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మూడు ఇన్నింగ్స్ల్లో కేవలం 43 పరుగులే చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa