ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్రాంతి పండుగ నేపథ్యంలో కూటమి పాలన అంటే క్యాసినో పాలనగా మారింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 01:28 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. సంక్రాంతి పండుగను అడ్డుపెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా కోడి పందాలు, క్యాసినోలు, రికార్డింగ్ డ్యాన్సులకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. ఇది పాలనా వైఫల్యానికి నిదర్శనమని ఆమె విమర్శించారు. మహిళల బట్టలు విప్పి నాట్యాలు చేయాలంటూ కూటమి నేతలు బూతులు మాట్లాడుతున్నా, వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని హోంమంత్రి అనితను ప్రశ్నించారు. నడిరోడ్డుపై నిందితులను ఊరేగించే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు.కూటమి నేతలకు ఒక న్యాయం, వైసీపీ నేతలకు మరో న్యాయమా అంటూ వరుదు కళ్యాణి నిలదీశారు. కూటమి పాలన అంటే క్యాసినో పాలనగా మారిపోయిందని, రికార్డింగ్ డ్యాన్సులకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని మండిపడ్డారు. మేక లేదా కేక్ కట్ చేస్తే కేసులు పెడుతున్న ప్రభుత్వం... మనిషి పీక కోసినా, మహిళలను అవమానించినా ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని దుయ్యబట్టారు.ఈ విషయాలపై హోంమంత్రి అనిత తక్షణమే ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa