అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక విభజన, పర్యావరణ సంక్షోభాలు ఆవిష్కరణల రంగంలో పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (UNCTAD) నివేదికను ఉటంకిస్తూ, 2024లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడులు భారీగా తగ్గాయని గుర్తుచేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం నిలకడగా ముందుకెళుతోందని, అందుకు తమ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని స్పష్టం చేశారు.పునరుత్పాదక శక్తి ప్రాజెక్టుల్లో 31 శాతం, నీరు-స్వచ్ఛత రంగాల్లో 30 శాతం, వ్యవసాయ-ఆహార రంగాల్లో 19 శాతం చొప్పున పెట్టుబడులు తగ్గడం ఆందోళనకరమని అన్నారు. లాభాలపైనే దృష్టి పెట్టే ప్రైవేట్ సంస్థలు ప్రాథమిక పరిశోధనలపై తక్కువగా ఖర్చు చేస్తాయని, ఈ అంతరాన్ని ప్రభుత్వాలే పూరించాలని సూచించారు. ప్రభుత్వాలు గ్రాంట్లు, ఆర్ అండ్ డి సబ్సిడీలు, వ్యూహాత్మక రంగాల్లో నేరుగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆవిష్కరణలకు అవసరమైన ఎకోసిస్టమ్ను నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa