భారతదేశం, ఐరోపా సమాఖ్యలు చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా పయనిస్తున్నాయని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెల్ లెయెన్ పేర్కొన్నారు. భారత్, ఐరోపా సమాఖ్యల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందం దాదాపు ఖరారయ్యే దశలో ఉంది. ఈ నేపథ్యంలో లెయెన్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం దిశగా ఇంకా చేయాల్సిన పని ఉందని తెలిపారు.దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆమె ప్రసంగిస్తూ, కొందరు ఈ డీల్ ను 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా అభివర్ణిస్తారని ఆమె పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా కోట్లాది మంది ప్రజలకు వస్తువులు, సేవలు ఎగుమతి, దిగుమతి చేసుకునే సౌలభ్యం కలుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె వచ్చే వారం భారతదేశంలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa