ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు శుభవార్త తెలిపిన ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 22, 2026, 07:23 PM

రాష్ట్ర ప్రభుత్వం దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు భారీ ఊరటనిచ్చింది. రెండో విడత పారిశ్రామిక ప్రోత్సాహకాలను మంగళవారం విడుదల చేసింది. ఈ విడతలో మొత్తం 3,617 మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.60.21 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.3,122 మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.53.05 కోట్లు, 495 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.7.16 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసినట్లు రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.దళిత, గిరిజన వర్గాల పారిశ్రామికవేత్తలను ఆర్థికంగా బలోపేతం చేసి, వ్యాపార రంగంలో ఎదిగేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం 11,451 మంది పారిశ్రామికవేత్తలకు రూ.269.9 కోట్ల విలువైన పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించినట్లు మంత్రి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa