ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమి ఆటవిక పాలనను భరించేందుకు సిద్ధంగా ఉన్నాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 03, 2026, 04:40 PM

వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతూ కూటమి నేతలు ఆటవిక పాలనకు తెరలేపారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఏపీని రావణకాష్ఠంగా మార్చారని మండిపడ్డారు. మరో మూడేళ్ల పాటు ఆటవిక పాలనను భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 2029లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని అన్నారు. కాపు, బీసే నేతలపై దాడులకు పాల్పడుతున్నారని అనిల్ విమర్శించారు. తిరుమల లడ్డూ గురించి దుష్ప్రచారం చేసి అడ్డంగా దొరికేశారని... దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు. కూటమి నేతలకు దమ్ముంటే పోలీసు వ్యవస్థను పక్కన పెట్టి సవాలు విసరాలని ఛాలెంజ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa