దేశంలో సిగరెట్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 1 నుంచి కేంద్ర బడ్జెట్లో పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ, సెస్లను పెంచడంతో ఈ ప్రభావం కనిపించింది. స్టెల్లార్ డిఫైన్ 20 సిగరెట్ల ప్యాక్ ధర రూ.280 నుంచి రూ.380కి పెరిగింది. గోల్డ్ స్మాల్ 10 సిగరెట్ల ధర రూ.95 నుంచి రూ.140కి చేరింది. రూ.10 సిగరెట్ ఇప్పుడు రూ.13 అయింది. పొగాకు వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ పన్నులు పెంచినట్లు కేంద్రం చెబుతోంది.సిగరెట్ తాగడం వల్ల తాగేవారికే కాదు… వారి చుట్టూ ఉన్నవారికి, ఆ పొగ పీల్చేవారికి కూడా చాలా హానికరం. అందుకే చాలామంది ధరల పెంపును స్వాగతించారు. అయితే ఈ ధరల పెంపు స్మగ్లింగ్, నకిలీ ఉత్పత్తులను ప్రోత్సహించవచ్చని పంపిణీదారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా సిగరెట్లను ఎంపిక చేసుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa