ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈడీ విచారణకు హాజరుకాని టీనా అంబానీ

national |  Suryaa Desk  | Published : Tue, Feb 10, 2026, 03:10 PM

మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ గైర్హాజరయ్యారు. దాదాపు 40 వేల కోట్ల రూపాయల భారీ బ్యాంకింగ్ మరియు కార్పొరేట్ మోసానికి సంబంధించి ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచారించేందుకు టీనా అంబానీకి ఇటీవల నోటీసులు పంపింది. మంగళవారం టీనాను విచారణకు రమ్మని కోరగా.. ఆమె గైర్హాజరయ్యారు. దీంతో మరోమారు టీనా అంబానీకి నోటీసులు పంపించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa