ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామంలో సయ్యద్ మహమ్మద్ షా ఖాద్రి ఉరుసు మహోత్సవం సందర్భంగా గురువారం వృషభ రాజుల బండలాగుడు పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత, నందికొట్కూరు నియోజకవర్గం ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో వృషభరాజ బండలాగుడు పోటీలు ఎంతో ఉత్సాహంగా కొనసాగుతాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా, గ్రామస్తులతో కలిసి పోటీలను ఉత్సాహంగా పర్యవేక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa