దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కొత్తగా రూపొందించిన ‘ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026-2030’ ముసాయిదాను రవాణా శాఖ విడుదల చేసింది. ఈ పాలసీ ప్రకారం రూ.30 లక్షల లోపు ఎలక్ట్రిక్ కార్లకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి 100 శాతం మినహాయింపు లభించనుంది. ఈ ప్రయోజనం 31 మార్చి 2030 వరకు అమల్లో ఉంటుంది. తక్కువ ఉద్గారాలను విడుదల చేసే హైబ్రిడ్ వాహనాలకు కూడా 50 శాతం రాయితీని ప్రతిపాదించింది. గాలి నాణ్యతను మెరుగుపరచడం, ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ను బలోపేతం చేయడం ఈ పాలసీ లక్ష్యాలు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa