ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉండవల్లిలో గుంటూరు విజయవాడ నేతలతో నారా లోకేశ్ ఆత్మీయ కలయిక కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 14, 2026, 08:57 PM

రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ప్రజాప్రతినిధులతో నిర్వహిస్తున్న 'ఆత్మీయ కలయిక - ఇల్లే వేదిక' కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని తన నివాసంలో గుంటూరు, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నేతలతో కలిసి ఆయన భోజనం చేశారు.ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ స్పందిస్త. అందరూ కలిసి ఒకేచోట భోజనం చేస్తూ, మాట్లాడుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకొచ్చిన వివిధ సమస్యలపై ఒక నివేదికను వారికి అందించినట్లు వివరించారు. వారు ఇచ్చిన విజ్ఞప్తులలో ఎన్ని పరిష్కరించబడ్డాయి, ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు చెప్పారు. ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చిన మహిళలకు మంగళగిరి చేనేత చీరలను కానుకగా అందజేసినట్లు లోకేశ్ తెలిపారు.గత కొన్ని రోజులుగా మంత్రి లోకేశ్ కూటమిలోని ప్రజాప్రతినిధులతో ఇలాంటి సుహృద్భావ సమావేశాలు నిర్వహిస్తుండటం ద్వారా పార్టీ శ్రేణులతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa