అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై భారీ వైమానిక దాడులు జరిపి, టెహ్రాన్ సహా అనేక ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ పరిణామాల అనంతరం ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ సామర్థ్యంపై గ్లోబల్ స్థాయిలో చర్చ మొదలైంది. ముఖ్యంగా, ఈ దాడులను ఇరాన్ ఎందుకు సమర్థవంతంగా అడ్డుకోలేకపోయిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇటీవలి కాలంలో రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునే క్రమంలో ఇరాన్, చైనా అభివృద్ధి చేసిన HQ-9B వైమానిక రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఈ వ్యవస్థ ఆశించిన స్థాయిలో పనిచేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా ఇదే వ్యవస్థ దెబ్బతిన్నట్లు నివేదికలు వచ్చాయి. తాజా పరిణామాలతో HQ-9B సామర్థ్యాలపై మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను China Aerospace Science and Industry Corporation తయారు చేసింది. ఇది చైనా స్వదేశీ ఉపరితలం-నుంచి-గగనతల క్షిపణి వ్యవస్థగా అభివృద్ధి చేయబడింది. రూపకల్పనలో ఇది రష్యాకు చెందిన S-300PMU, అమెరికా యొక్క Patriot PAC-2 వ్యవస్థలకు సమానంగా ఉందని చెబుతారు. 2006లో తొలిసారి పరీక్షించబడిన ఈ వ్యవస్థ దాదాపు దశాబ్దకాలంగా సేవల్లో ఉంది. సుమారు 260 కి.మీ పరిధి, 50 కి.మీ ఎత్తు వరకు లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీనికి ఉన్నట్లు సాంకేతిక వివరాలు సూచిస్తున్నాయి.యాక్టివ్ రాడార్ హోమింగ్, పాసివ్ ఇన్ఫ్రారెడ్ సీకర్ వంటి సాంకేతికతలతో స్టెల్త్ విమానాలపై కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని ప్రచారం జరిగింది. ఒకేసారి 6–8 లక్ష్యాలను ఛేదించడం, 100 వరకు లక్ష్యాలను ట్రాక్ చేయగలగడం దీని ప్రత్యేకతలుగా పేర్కొంటారు. బీజింగ్, టిబెట్, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో ఈ వ్యవస్థను చైనా మోహరించింది. చైనా వైమానిక రక్షణ నెట్వర్క్లో ఇది కీలక స్థంభంగా భావించబడుతోంది. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో, కాగితాలపై ఉన్న సామర్థ్యాలు వాస్తవ యుద్ధరంగంలో ఎంతవరకు ఉపయోగపడతాయన్నది చర్చనీయాంశమైంది.ఇరాన్కు HQ-9B ఎలా చేరింది? గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్ తన రక్షణ వ్యవస్థను ఆధునికీకరించడానికి చర్యలు ప్రారంభించింది. చమురు సరఫరాకు ప్రతిగా చైనాతో HQ-9B క్షిపణి వ్యవస్థల ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. 2025లో ఇజ్రాయెల్ క్షిపణి దాడుల సమయంలో రష్యన్ S-300PMU-2 వ్యవస్థ పరిమిత పనితీరు కనబరిచిన తర్వాత, ఇది ఇరాన్కు పెద్ద అప్గ్రేడ్గా భావించబడింది. నాటాంజ్ అణు కేంద్రం, ఫోర్డో సుసంపన్న కేంద్రం, IRGC క్షిపణి మరియు UAV స్థావరాలు, టెహ్రాన్, ఇస్ఫహాన్ సమీప ప్రాంతాల్లో ఈ వ్యవస్థను మోహరించినట్లు తెలుస్తోంది.శనివారం (ఫిబ్రవరి 28, 2026) అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో టెహ్రాన్తో పాటు 28 ప్రావిన్సులు ప్రభావితమయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa