గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలో తాటిపర్రు పెట్రోల్ బంకు వద్ద ఆదివారం, బాపట్ల నుండి అతివేగంగా వస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే, కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. స్థానికులు వెంటనే స్పందించి కారులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. పొన్నూరు రూరల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa