మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామివారి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు నిర్వహించిన వివిధ సేవలు ద్వారా స్వామివారి ఆలయానికి రూ. 2, 36, 177 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు
వాటిలో లడ్డు ప్రసాదం విక్రయం, దర్శనము టిక్కెట్లు విక్రయం ద్వారా రూ. 1, 65, 770, నిత్య అన్నదాన ట్రస్ట్ కు విరాళముల ద్వారా రూ. 70, 407 ఆదాయం వచ్చిందని తెలిపారు. అలాగే శ్రీ స్వామి వారిని 2, 381మంది దర్శించుకున్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి మరియు, ఛైర్మన్ శ్రీ చిట్టూరి రామకృష్ణ, ధర్మ కర్తల మండలి సభ్యులు భక్తులకు కావలసిన ఏర్పాట్లు పర్యవేక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa