ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో సీఎం జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయకు రానున్నాను. దివంగత ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి నేపథ్యంలో ఇడుపులపాయకు సీఎం రానున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మంగళవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్, గెస్ట్ హౌస్, నెమళ్ల పార్కు తదితర ప్రాంతాలను ఆయన జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, పాడా ఓఎస్డీ అనిల్కుమార్రెడ్డి, పులివెందుల ఆర్డీఓ వెంకటేశులు, జెడ్పీటీసీ రవికుమార్రెడ్డిలతో కలిసి కలెక్టర్ విజయరామరాజు పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ.. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముందుగా నిర్ణయించిన మేరకే అధికారులను, ప్రజాప్రతినిధులను అనుమతించాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. అయితే, సీఎం జగన్ అధికారిక పర్యటనకు సంబంధించి పైర్తి షెడ్యూల్ వివరాలు రావాల్సి ఉందన్నారు. సీఎం జగన్ పర్యటన సందర్భంగా అధికారులు నిర్లక్ష్యంగా ఉండకుండా చురుగ్గా పనిచేయాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa