ఆసియా కప్లో నిన్న పాకిస్థాన్తో 100వ టీ20 మ్యాచ్ ఆడిన భారత స్టార్ విరాట్ కోహ్లీని న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ అభినందించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 100 మ్యాచ్లు ఆడిన తొలి భారత క్రికెటర్గా కోహ్లి ఆదివారం నిలిచాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఫామ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్కు పాక్ నిర్దేశించిన 148 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేఎల్ రాహుల్ గోల్డెన్ డకౌట్ కాగా, రోహిత్తో కలిసి కోహ్లీ కాసేపు ఇన్నింగ్స్ని నడిపించాడు. ఈ మ్యాచ్లో కోహ్లి అదృష్టం కూడా బాగానే ఉంది. రెండో బంతికి ఫఖర్ జమాన్ స్లిప్లో క్యాచ్ని అందుకోలేకపోయాడు. కాసేపు నిలకడగా ఆడిన కోహ్లి.. 34 బంతుల్లో 35 పరుగులు చేసి ఇబ్బంది లేదన్నాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా అద్భుతంగా ఆడటంతో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోహ్లి 100వ టీ20 మ్యాచ్పై రాస్ టేలర్ శుభాకాంక్షలు తెలిపాడు. 100 టీ20 మ్యాచ్లు ఆడిన క్రికెటర్ల క్లబ్లోకి కోహ్లీని టేలర్ స్వాగతించాడు. రానున్న రోజుల్లో కోహ్లీ మరింత దూకుడుగా రాణిస్తాడని భావిస్తున్నట్లు టేలర్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. 100వ టీ20 మ్యాచ్లో కోహ్లీకి అభినందనలు.. రానున్న కాలంలో మీ నుంచి మరిన్ని గొప్ప ప్రదర్శనల కోసం ఎదురు చూస్తున్నాను’’ అని టేలర్ ట్వీట్ చేశాడు.ఏబీ డివిలియర్స్, ఫాఫ్ డుప్లెసిస్ వంటి దిగ్గజాలు కూడా 100 టీ20 మ్యాచ్లు ఆడిన కోహ్లీకి అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోహ్లీ, డివిలియర్స్ స్టార్ బ్యాట్స్మెన్గా నిలిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa