పల్నాడు జిల్లా, నాదెండ్ల మండలం కనపర్రులో టీడీపీ నేతలు , వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ప్రక్రియలో వైసీపీ కార్యకర్తలను టీడీపీ నేతలు కారుతో ఢీ కొట్టి నాట్లు వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘర్షణల వలన ఇరు పార్టీ కార్యకర్తలకి గాయాలైనాయి. గాయాల పాలైన వారిని స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. వైసీపీ నేత , గ్రామా సర్పంచ్ వెంకటేశ్వర్లుపై కూడా దాడి జరిగినట్లు ఆయన తెలియజేసారు. నిన్నటి నుంచి గ్రామంలో రెచ్చగొట్టే చర్యలతో ఒక వర్గం వారు అరాచకం చేస్తున్నట్లు గ్రామస్తులు తెలియజేసారు. ఇది ప్రశ్నించిన సర్పంచ్ వెంకటేశ్వర్లుపైనా దాడి చేసినట్లు తెలుస్తుంది. పోలీస్ వారు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. తదుపరి విషయం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa