ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ధర్మకర్తల బోర్డును రద్దు చేసిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్

national |  Suryaa Desk  | Published : Tue, Sep 13, 2022, 11:19 PM

మహారాష్ట్రలో సర్కార్ మారడంతో గత ప్రభుత్వ నిర్ణయాలు సైతం మారుతున్నాయి. ఇదిలావుంటే ప్రఖ్యాత షిర్డీ సాయిబాబా ఆలయానికి చెందిన ధర్మకర్తల బోర్డును బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ రద్దు చేసింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో ఈ బోర్డును నియమించారు. మరోవైపు వచ్చే 8 వారాల్లోగా కొత్త ధర్మకర్తల మండలిని నియమించాలని హైకోర్టు బెంచ్ ఆదేశించింది.  నిబంధనల మేరకు ధర్మకర్తల మండలిని నియమించలేదని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తొలుత ఎన్సీపీ ఎమ్మెల్యే అశుతోష్ కాలేను బోర్డు అధ్యక్షుడిగా నియమించి, మరికొందరిని ట్రస్ట్ సభ్యులను చేశారని పిటిషన్ దారులు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ పిటిషన్లను విచారించిన ఔరంగాబాద్ బెంచ్ ఈరోజు తీర్పును వెలువరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa