గూడూరు పట్టణం సొసైటీ ప్రాంతంలోని 13వ సచివాలయం వాలయానందపురం-1లో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కొరకే వైఎస్సార్ ప్రభుత్వం ఏర్పాటు అయిందన్నారు. అందుకోసమే అనేక సంక్షేమ ప్రభుత్వ పథకాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
సంక్షేమ పథకాలు ప్రజలందరికీ సక్రమంగా అందేలా చూడటానికి సచివాలయ వ్యవస్థను, వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడటమే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ద్యేయం అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావును ఘనంగా శాలువాలతో పూలమాలలతో సత్కరిస్తూ, నీరాజనాలు అందిస్తూ ప్రజలు, అభిమానులు జయ జయ ధ్వానాలు చేశారు. మళ్లీ మీరే ఎమ్మెల్యే కావాలంటూ ప్రజలు ఆశీర్వదించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి సచివాలయం పరిధిలో 20 లక్షల రూపాయలను, ఒక శాసన సభ్యుని కి రెండు కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను కేటాయించినట్లు తెలిపారు. ఆ నిధులను అభివృద్ధి పనుల కోసమే వినియోగిస్తున్నట్లు, అవి కూడా చాలకపోతే, తన సొంత నిధులను అభివృద్ధి పనుల కోసం విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన వాలయా నందపురంలోని ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు.
ఆ పాఠశాలకు నాడు - నేడు కింద 89 లక్షల రూపాయలు మంజూరు అయిందన్నారు. కొత్తగా 5 తరగతి గదులు నిర్మించడానికి 60 లక్షలు రూపాయలు, మరుగుదొడ్ల మరమ్మతులకు, ఆర్ఓ ప్లాంట్ నిర్మాణానికి, గ్రీన్ బోర్డ్స్, ఫర్నిచర్ కొనుగోలుకు, పెయింటింగ్, కొత్తగా కాంపౌండ్ వాల్ నిర్మాణానికి మిగిలిన 29 లక్షల రూపాయలను వినియోగిస్తున్నట్లు తెలిపారు.
పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన లాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి వాళ్లందరూ చదువుకుని ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశించి ముఖ్యమంత్రి ఈ పథకాలను ప్రవేశపెట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలందరికీ చేరువయ్యేలా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పనిచేయాలని ఎమ్మెల్యే తెలిపారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆదరించి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేలా మీరందరూ ఆశీర్వదించాలని ఎమ్మెల్యే వరప్రసాద్ రావు అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సాయినాథ్, వైసీపీ నాయకులు కోదండరామ స్వామి దేవస్థానం చైర్మన్ తాళ్లూరు శ్రీనివాసులు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొట్టు గోవర్ధన్, టౌన్ ఎస్సీ సెల్ నాయకులు నరసయ్య, ఎన్. వి. రమణయ్య, మైనారిటీ నాయకులు అజీజ్ ఖాన్, అల్తాఫ్ భాయ్ లక్ష్మి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa