ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడు రాజధానులే ప్రభుత్వ విధానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 14, 2022, 01:09 PM

విశాఖ అభివృద్ధి కోరుతూ విశాఖపట్నం నగర ప్రముఖులతో నిర్వ‌హించిన ఆత్మీయ సదస్సు లో విశాఖ ఉమ్మడి జిల్లాల పార్టీ రీజిన‌ల్ కో-ఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి  పాల్గొని ప్ర‌సంగించారు. రాష్ట్రంలో మూడు రాజధానులే తమ ముఖ్యమంత్రి ఉద్దేశం, తమ ప్రభుత్వ విధానం అని చెప్పారు.  విశాఖలో పరిపాలన, కర్నూలులో న్యాయ, అమరావతిలో శాసన రాజధానుల ఏర్పాటుతో మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నారని చెప్పారు. చంద్రబాబునాయుడుకి రాష్ట్రం బాగుపడడం, మంచి జరగడం ఇష్టం ఉండదని, అందుకే అమరావతి పేరుతో పాదయాత్ర ప్లాన్‌ చేశారని విమర్శించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa