గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా 10 గంటలకు శాసన మండలి సమావేశాలు మొదలవుతాయి. అసెంబ్లీ, మండలి సమావేశాలు ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. శనివారం, ఆదివారం సమావేశాలకు సెలవు ఉంటుంది. తిరిగి సోమవారం నుంచి బుధవారం వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. శాసన సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) భేటీలో సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.
అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చట్టసభల్లో చర్చించేందుకు అధికార పక్షం సర్వ సన్నద్ధమైంది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించిన మేరకు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని అధికార పక్షం నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటు, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనా వికేంద్రీకరణకు తీసుకున్న చర్యలు, ఇప్పటికే చేపట్టిన పరిపాలన సంస్కరణలపై విస్తృతంగా చర్చించేందుకు సిద్ధమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa