కర్నాటకలోని బళ్లారిలోని విమ్స్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో ముగ్గురు పేషెంట్లు విద్యుత్ అంతరాయం కారణంగా మరణించారు.మౌలా హుస్సేన్ (35) కిడ్నీ ఫెయిల్యూర్తో మృతి చెందగా, చెట్టెమ్మ (30) పాముకాటుకు గురైంది. మరణించిన మూడో రోగి మనోజ్కుమార్గా గుర్తించారు.ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య మాట్లాడుతూ, ఉదయం 8 నుండి 10:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, ఆ సమయంలో జనరేటర్ పనిచేయలేదని, ఐసియులో వెంటిలేటర్పై ఉన్న ముగ్గురు వ్యక్తులు మరణించారని చెప్పారు.ఈ మరణానికి కళాశాల డైరెక్టర్, వైద్యారోగ్యశాఖ మంత్రి, శాఖ, అధికారులతోపాటు జిల్లా డిప్యూటీ కమిషనర్ బాధ్యత వహించాలని, ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరారు.బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిద్ధరామయ్య అన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa