ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌ నిరంకుశ పాలన మంచిది కాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 18, 2022, 12:15 PM

రాజధాని అమరావతికి గతంలో మద్దతిచ్చిన జగన్‌.. ఇప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని భాజపా జాతీయ కార్యదర్శి సత్య కుమార్  విమర్శించారు. రాజధాని నిర్మించుకోలేని సీఎంగా ఆయన నిలిచారన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సత్యకుమార్‌ మాట్లాడారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తుందన్న నమ్మకం తమకుందని చెప్పారు. జగన్‌ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ రోడ్లపై వైకాపా నేతలను ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు. ప్రజల గొంతుకగా భాజపా ఆందోళనలు కొనసాగిస్తుందన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa