ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్ధ (ఏపీఐఐసీ) 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏపీఐఐసీ గోల్డెన్ జూబ్లీ లోగోను సీఎం జగన్ ఆవిష్కరించారు. పారదర్శక పారిశ్రామిక విధానంతో పారిశ్రామిక వాడల అభివృద్దికి నిరంతరం కృషిచేయాలని సీఎం జగన్ సూచించారు. రాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక పోషిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సీఎం స్పూర్తితో మరింత వేగంగా పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారిస్తామన్న ఏపీఐఐసీ ప్రతినిధులు, ఈ ఏడాది పాటు నిర్వహించబోయే స్వర్ణోత్సవ వేడుకల వివరాలను సీఎంతో ఏపీఐఐసీ టీమ్ పంచుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండి జేవీఎన్. సుబ్రహ్మణ్యం, ఏపీఐఐసీ ఉన్నతాధికారులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa