పెద్దకడబూరు: పెద్దకడబూరు మండల పరిధిలోని హనుమాపురం గ్రామంలో సర్పంచ్ పూజారి ఇందిర ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాల అమలు, వాటి లబ్ధికి సంబందించిన కరపత్రాలను అందజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ప్రజలకు వివరించారు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మీకు మేలు జరుగుతుందని ప్రశ్నించగా జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు ప్రదీప్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పూజారి ఈరన్న, ఎంపీడీవో వెంకట రమణప్ప, ఏవో వరప్రసాద్, ఆర్ఐ మహేష్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa