భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణాలపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ కమిషన్ చైర్మన్ మూరంమూడీ విక్టర్ ప్రసాద్ ఆదేశాలను స్వాగతిస్తూ సమతా సైనిక్ దళ్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు చౌడవరం సుబ్బ నరసయ్య తన కార్యవర్గంతో కలిసి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బనరసయ్య మంగళవారం ఓబులవారిపల్లిలో మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని నిర్మించి బానిస సంకెళ్లు తెంచిన బాబాసాహెబ్ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహాల నిర్మాణ ప్రతిష్టకు సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు పాటిస్తూ ట్రాఫిక్ అంతరాయం లేని ప్రదేశాలలో పెట్టుకునేందుకు అపారమైన కృషి చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ కు సమతా సైనిక్ దళ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ ఫోరం కన్వీనర్ బియ్యాల రమణ ఎస్ ఎస్ డి శ్రీను వాసులు ఎస్ ఎస్ డి కార్యవర్గం పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa