వై.ఎస్.వివేకా కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ప్రాణభయంతో ఇబ్బంది పడుతున్నారని తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి చెప్పారు. దస్తగిరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత సీఎం జగన్దే అని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి త్వరలోనే అరెస్ట్ కాక తప్పదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బుధవారం బీటెక్ రవి మీడియాతో మాట్లాడుతూ.. అప్రూవర్గా మారిన దస్తగిరి ప్రాణభయంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. దస్తగిరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత సీఎం జగన్దే అని తెలిపారు.
తనకు ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలన్న దస్తగిరి ఆరోపణలను చూస్తే.. వైఎస్ వివేకా హత్య కేసులో సీఎం పాత్ర ఉందని అనుమానం వస్తోందని బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్య వెనుక ఎవరున్నారే విషయం పులివెందుల ప్రజలకు తెలుసన్నారు. జైల్లో ఉన్న నిందితులకు బెయిల్ వచ్చే పరిస్థితి కూడా లేదని పేర్కొన్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో ఇటీవల సీబీఐకి సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల ఇచ్చిన వాంగ్మూలం సునీతకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోందని బీటెక్ రవి అన్నారు. దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్న నేతల ప్రమేయాన్ని షర్మిల సీబీఐకి స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం ఉందని బీటెక్ రవి వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa