కళ్యాణ్దుర్గం: 14 నుండి 18 వరకు విజయవాడలో జరుగు సిపిఐ జాతీయ మహాసభలు ను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవప్ప నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ పిలుపునిచ్చారు. సిపిఐ జాతీయ మహాసభలు విజయవంతం కోరుతూ బంగి ఎర్రి స్వామి మెమోరియల్ హాల్ లో నాగరాజు నాయక్ అధ్యక్షతన సిపిఐ నియోజకవర్గ కార్యవర్గ సమావేశం జరిగింది. నాయకులు జాతీయ మహాసభల పోస్టర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 24వ జాతీయ మహాసభలకు పార్టీ శ్రేణులు సానుభూతిపరులు వామపక్ష మేధావులు పెద్ద ఎత్తున తరలి రావాలి అన్నారు. విజయవాడలో జరిగే జాతీయ మహాసభ దేశ రాజకీయాలలో పెను మార్పులు తీసుకొస్తుంది అన్నారు. మోదీ అధికారం చేపట్టాక ప్రజా కంటక విధానాలు అమలు చేస్తూ, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారు అన్నారు. మతోన్మాదం పేచ్చరిల్లుతుంది అని, సరళీకరణ, ప్రైవేటీకరణ పేరిట ప్రజలపై గుదిబండ మోపుతున్నారు అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారు అన్నారు. ఈనెల 13వ తేదీన రాత్రి 8 గంటలకు రెండు ప్రత్యేక రైళ్లు ఒకటి అనంతపురం నుండి మరొకటి ధర్మవరం నుండి బయలుదేరుతాయని నియోజకవర్గం నుండి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం సహాయ కార్యదర్శి మహాదేవ రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి నరసింహులు కుందుర్పి కంబదూరు కళ్యాణదుర్గం మండల కార్యదర్శి లు శివలింగప్ప తిరుపాల్ ఆంజనేయులు జిల్లా కౌన్సిల్ సభ్యులు అశ్వత్ పట్టణ కార్యదర్శి ఓంకార్ ఏఐఎస్ఎఫ్ తాలూకా కార్యదర్శి హనుమంతు తదితరులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa