ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామాన్యులపై భారం పడకుండా చేశాం: కేంద్రం వెల్లడి

national |  Suryaa Desk  | Published : Fri, Oct 14, 2022, 12:10 AM

ఎల్పీజీ ధరలు పెరుగుదల భారం సామాన్యులపై పడకుండా జాగ్రత్తలు తీసుకొన్నామని కేంద్రం వెల్లడించింది. ఇదిలావుంటే ప్రభుత్వ రంగ సంస్థల చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఒకేసారి 22,000 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. నగదు చెల్లింపునకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకరించిందని ఆయన వెల్లడించారు. ఎల్పీజీ ధరలు పెరగుతున్నాయని, ఆ భారం సామాన్యులపై పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. "ప్రపంచవ్యాప్తంగా ఎల్‌పీజీ ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ధరల భారం సామాన్యులపై పడకుండా ఉండేందుకు ఓఎంసీలకు రూ.22,000 కోట్లను ఒకేసారి మంజూరు చేస్తాం." అని ఠాకూర్ చెప్పారు.


ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్ప్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కలసి చమురును 90 శాతానికి పైగా సరఫరా చేస్తున్నాయి. అయితే అంతర్జాతీయ చమురు ధరలు గణనీయంగా పెరగడంతో ఈ మూడు సంస్థలు దారుణమైన నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. అంతేకాకుండా ఆ భారం సామాన్యులపై పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాటికి నష్ట పరిహారం అందిచేందుకు నిర్ణయం తీసుకుంది.


ఇదిలావుంటే చమురు మార్కెటింగ్ కంపెనీలు అక్టోబర్ ఒకటో తేదీన.. 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధరను రూ. 25.5 తగ్గించాయి. ఈ మేరకు ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 1,859గా ఉంది. అయితే సాధారణ LPG సిలిండర్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 1,053గా కొనసాగుతోంది. గత కొన్నాళ్లుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్యులపై భారం పెరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa