ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసులో శత్రువులను ఇరికించాలని చూసి తానే ఇరుక్కున్న మహిళ

national |  Suryaa Desk  | Published : Sun, Oct 23, 2022, 08:55 PM

కేసులో అనవసరంగా తన శత్రువులను ఇరికించాలని భావించిన ఓ మహిళా  తన పన్నగంలో తానే ఇరుకొని కటకట్టాల పాలైంది. న్యాయ వివాదంలో ఉన్న ఆస్తిని ఎలాగైనా దక్కించుకోవాలని ఓ మహిళ ప్లాన్ వేసింది.. తనపై సామూహికంగా అత్యాచారం చేశారంటూ పోలీసులను ఆశ్రయించింది. ఘజియాబాద్ లో జరిగిన ఈ ఘటనపై మహిళా కమిషన్ కూడా స్పందించింది. బాధితురాలికి న్యాయం చేయాలని లేఖ రాయడంతో పోలీసులు పరుగులు పెట్టారు. తీరా విచారణలో ఆ మహిళ చెప్పిందంతా బూటకమని, అసలు ఆమెపై అత్యాచారమే జరగలేదని తేలడంతో అధికారులు నివ్వెరపోయారు. ఆస్తి కోసం సదరు మహిళే ప్లాన్ చేసి అత్యాచారం జరిగిందంటూ నాటకమాడిందని బయటపడింది. దీంతో సదరు మహిళతో పాటు ఆమెకు సహకరించిన స్నేహితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిపై చీటింగ్ కేసుతో సహా పలు సెక్షన్ల కింద కేసు పెట్టి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. జడ్జి వారిని 14 రోజుల కస్టడీకి ఆదేశించారు.


ఘజియాబాద్ కు చెందిన ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించింది. నలుగురు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి, సామూహికంగా తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమెను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి పంపించి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసి మరీ నేరస్థుల కోసం వెతికారు. బాధితురాలు చెప్పిన నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుంటే బాధితురాలిపై అత్యాచారం జరిగిన ఆనవాళ్లేమీ కనిపించలేదని వైద్యులు తేల్చారు. దీనిపై మరింత లోతుగా విచారించగా అసలు విషయం బయటపడింది. న్యాయ వివాదంలో ఉన్న ఆస్తిని దక్కించుకోవడం కోసం మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచార నాటకమాడినట్లు సదరు మహిళ వెల్లడించింది. అసలు విషయం బయటపడడంతో పోలీసులను తప్పుదోవ పట్టించిన సదరు మహిళను కఠినంగా శిక్షించాలంటూ మహిళా కమిషన్ లేఖ రాసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa