అమరావతి రాజధాని కోసం సాగుతున్న ఉద్యమ సెగలు వరల్డ్ కప్ మ్యాచ్ లోనూ కనిపించాయి. టీ-20 వరల్డ్ కప్లో భారత్-పాక్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్కు మంచి కిక్ ఇచ్చింది. ఒక రోజు ముందే దీపావళి తీసుకొచ్చింది.. చివరి ఓవర్ వరకు సస్పెన్స్లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కోహ్లీ మెరుపు ఇన్సింగ్ అదుర్స్ అంటూ సోషల్ మీడియాను హోరెత్తించారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్కు కొంతమంది తెలుగువాళ్లు కూడా వెళ్లారు.. వారిలో టీడీపీ అభిమాని ఒకరు అక్కడ అమరావతి నినాదాన్ని వినిపించారు.
మ్యాచ్ జరిగే సమయంలో ఓ టీడీపీ అభిమాని అమరావతికి మద్దతుగా నినాదంతో ఓ ప్లకార్డుతో కనిపించాడు. జై టీడీపీ అంటూ అమరావతి ఏకైక రాజధాని అంటూ నినదించారు. కొంతమంది ఈ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటో చూసి తెలుగు తమ్ముళ్లు పండగ చేసుకుంటున్నారు. అమరావతి నినాదంతో పాటూ టీడీపీపై అభిమానం ఖండాంతరాలు దాటింది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఫోటో వైరల్ఓవైపు తెలుగు తమ్ముళ్లు ఖుషీ అవుతుంటే.. టీడీపీని వైఎస్సార్సీపీ అభిమానులు కొందరు టార్గెట్ చేశారు. ఎక్కడకు వెళ్లినా ఇంతేనా అంటూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తం మీద పార్టీ అభిమాని టీడీపీ, అమరావతి నినాదం వినిపించడంతో తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపింది. టీ20 మ్యాచ్లో టీమిండియా గెలవడంతో పాటూ అమరావతి నినాదం వినిపించడంతో తెలుగు తమ్ముళ్లు ఖుషీ అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa