ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన ఇసుక ర్యాంపు ఏర్పాటుపై స్థానికులతో కలిసి ఆందోళనకు దిగిన గోరంట్ల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 26, 2022, 05:16 PM

రాజమండ్రి స్థానిక ఆల్కట్ తోట  18,19,20 వార్డులకు సమీపంలో జన నివాసాల మధ్యలో ఇసుక ర్యాంపు ఏర్పాటు చేయడానికి చూస్తున్నారని స్థానిక వాసులు తెలియజేశారు. దీనిపై నేడు రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వార్డులో ఉన్న  స్థానికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు గోరంట్ల అక్కడ స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు గోరంట్ల మాట్లాడుతూ....  రాష్ట్రంలో ఆటవిక, అరాచక పాలన సాగుతుందని  ఈ అవినీతి ముఖ్యమంత్రి  అండ చూసుకుని రాష్ట్రంలో ఇసుక మాఫియా విచ్చలవిడిగా రాజ్యమేలుతుందని,అధికారులు ఇసుక మాఫియా వారితో కుమ్మక్కయి చోద్యం చూస్తున్నారని,రాజమండ్రిలో విచ్చలవిడిగా ఇసుక మాఫియా జరుగుతుందని దీనికి  ఉదాహరణగా ఇప్పుడు జనవాసాల మధ్య ఇసుక ర్యాంపు ఏర్పాటు చేయడం అనేది  దుర్మార్గపు చర్య అని దీనివల్ల స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతారని గోరంట్ల ధ్వజమెత్తారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa