విశాఖపట్నం నగరంలోని గోపాలపట్నం రైల్వే స్టేషన్ వద్ద మల్లి గణేష్ రావు అలియాస్ సురేష్(30) అనే వ్యక్తి రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. తన కోసం ఎవరూ వెతకవద్దంటూ గత రాత్రి కుటుంబ సభ్యులకు మృతుడు సురేష్ సెల్ఫోన్లో మెసేజ్ పెట్టాడు. దీనిపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సమాచారం అందించిన గోపాలపట్నం పోలీసులు సమయానికి స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులపై నగర్ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. కాగా... రాత్రి సమయం కావడంతో రైల్వే ట్రాక్పై ఉన్న మృతదేహాన్ని గుర్తించలేకపోయామని గోపాలపట్నం పోలీసులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa