ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెత్త నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 28, 2022, 07:26 PM

విశాఖ నగరంలో చెత్త నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని జివిఎంసి కమిషనర్ పి. రాజాబాబు శానిటేషన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జోన్-3, 20వ వార్డు పరిధిలోని పెద్దవాల్తేరు, గాంధీ జంక్షన్, చేపల బజారు తదితర ప్రాంతాలలో వార్డు కార్పొరేటర్ నక్కెల్ల లక్ష్మితో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డులోని సమస్యలను కార్పొరేటర్ తెలిపారని, ముఖ్యంగా చెత్త తరలించే వాహనాలు ప్రతి రెండు రోజులకు ఒక్కసారి రావడం వలన వ్యర్థాలు డస్ట్ బిన్నులు చుట్టూ పోస్తున్నారని, దానివలన దోమలు, కుక్కలు, పందులుతో పాటు దుర్వాసన వస్తున్నందున సమీప ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారని, క్లాప్ వాహనం ప్రతి రోజు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వార్డులో మొక్కలు ఏపుగా పెరిగినందున వీధి దీపాల వెలుగు రోడ్డుపైకి రాకపోవడం వలన చీకటిగా ఉంటుందని, అందులకు చెట్లను ట్రిమ్మింగ్ చేయించాలని ఆదేశించారు. చేపల బజారు వద్ద భూగర్భ డ్రైనేజి నాళాలను శుభ్రం చేసి నాళాలు పొంగకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చేపల బజారులో రెండవ మార్గం కావాలని అడిగారు. దానిని పరిశీలిస్తామని కమిషనర్ తెలిపారు. డ్రైన్ల పై కాంక్రీట్ శ్లాబ్ వలన మురుగు వ్యర్ధాలుతో కాలువలు పూడుకుపోయి ఇబ్బంది కలుగుతున్నందున. కాంక్రీటు పలకలు తొలిగించి, వ్యర్ధాలు తీసి మురుగుపోయే విధంగా చూడాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa