అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఈ. భోనంగి పంచాయతీ పరిధి గౌతు లచ్ఛన్న కాలనీలో ఓ మహిళ ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పరవాడ సీఐ పెదిరెడ్ల ఈశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రియాంక నిశల్(30) భర్త రామ్ప్రతాప్తో కలిసి ఈ కాలనీలో నివాసం ఉంటున్నారు. భర్త రామ్ప్రతాప్ స్థానిక ఏపీఐఐసీలో గల బార్గవ్ గ్యాస్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వీరికి 6 నెలల క్రితమే వివాహం అయింది. కాగా మృతురాలు కూడా వారం రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడకు వచ్చింది.
దీపావళి పండగ అనంతరం భర్త డ్యూటీ నిమిత్తం కటక్ వెళ్లగా ఆమె ఒక్కరే ఇక్కడ ఉంటోంది. అయితే శుక్రవారం ఉదయం నుంచి ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించకపోవడంతో భర్త ప్రతాప్ తమ ఇంటి పక్కనే ఉంటోన్న తోటి కార్మికుడికి ఫోన్ చేసి ఆమెతో మాట్లాడిరచమని కోరాడు. దీంతో వారు వెళ్లి తలుపులు తెరిచి చూడగా ఆమె గదిలోని సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెంది కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పైగా మృతురాలి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆమెకు సంబంధించి బందువులు, తెలిసిన వారెవరూ ఇక్కడ లేకపోవడంతో వీఆర్వో పిర్యాదు మేరకు ఈ ఘటనపై సీఐ ఈశ్వరరావు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa