ఐపీఎస్ చదువుకుంటే మీ లా క్రిమినల్స్ కి సెల్యూట్ చెయ్యాలి అందుకే నేను ఐపీఎస్ చదవలేదు. కాపాడాల్సిన పోలీసులే దాడులు చేస్తుంటే ఇంకేమి చేయాలి, తప్పక చెప్పు చూపించా అంతే గాని సరదా కాదు అని మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ వాపోయారు. ఢిల్లీ నుండి నాకు నిఘా వర్గాల హెచ్చరిక ముందే వచ్చింది, నా మీద దాడులు చేస్తారని. మా వాళ్లకు జైల్లో భోజనాలు కూడా చేయలేదు అని పంచకర్ల సందీప్ చెప్పేరు.మీ పదవి మీకు ఎక్కువ కావచ్చు మాకు కాదు, ప్రజాస్వామ్యం ఇంకా బలోపేతం కావాలి, నేర చరిత్ర నాయకులు అధికారంలో ఉన్నారన్నారు. 2024లో మన జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే లా అండ్ ఆర్డర్ ప్రక్షాళన చేస్తాం. పబ్లిక్ గా శిక్షలు అమలు చేయాలి, నేరస్తులకు భయం కలగాలి. నన్ను తిడుతుంటే కొంతమంది ఇంచార్జిలు చేతకాని వాళ్ళులా మిగిలిపోతున్నారు, అలాంటి వాళ్ళు నాకు అవసరం లేదు. పార్టీ నడపటం ఆషామాషీ విషయం కాదు, అయిన నడుపుతున్న, ఉచిత సలహాలు ఇవ్వద్దు, కష్టపడి పనిచేయండి, లీగల్ టీం ను బలోపేతం చేస్తాం, ఉత్తరాంధ్ర నాయకులను మారుస్తాం, పార్టీలో చెత్త చాలా ఉంది, మీకు వ్యాపారాలు ముఖ్యమా పార్టీ ముఖ్యమా? అని ప్రశ్నించారు. NOTA కు ఓట్లు వేసి ఏమి సాధిస్తారు? ఎదో పార్టీకి ఓటు వేయండి నోటా కు కాదు. మాకు 10ఎమ్మెల్యేలు ఇవ్వండి, రాష్ట్రాన్ని మార్చి చూపిస్తా.మిమ్మల్ని నమ్మి భాద్యతలు అప్పగిస్తా, 2024 లో జనసేన ప్రభుత్వం రాబోతుంది అని ధీమా వ్యక్తపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa