ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉర్దూ డిగ్రీ కాలేజీ సాధనకోసం శ్రమిస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 31, 2022, 06:20 PM

కడప  జిల్లాలో కడప తరువాత అధికంగా ముస్లింలు వున్న ప్రొద్దుటూరులో ఉర్దూ డిగ్రీ కాలేజీ సాధనకోసం ముస్లిం సంక్షేమ సంఘం పోరాడుతోందని అధ్యక్షుడు ఖాజామోహిద్దీన్‌ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఒన్‌టౌన్‌సర్కిల్లోని షాదీ మంజిల్‌లో ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేధావుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఖాజామోద్దీన్‌ మాట్లాడుతూ....  ముస్లిం కుటుంబాలలో విద్య పట్ల ఆసక్తిని పెంచే కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ముస్లిం విద్యావేత్తలు మేథావులు రషీద్‌ ఖాన్‌, ఫరీద్‌ బాష, ఉమర్‌ బాష, రహమతుల్లా, ఎస్‌ అహ్మద్‌ హుసేన్‌, డాక్టర్‌ ఇమాంఖాసీం,ఆర్‌ అహ్మద్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa