మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం ఒంగోలుకు వస్తున్నారు. ఉదయం చీరాల, వేటపాలెంలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం 12గంటలకు త్రోవగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా నగరంలోని బీకే ఎన్క్లేవ్ ఉన్న మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నివాసానికి వెళ్తారు. అక్కడ మధ్యాహ్న భోజనం ముగించుకొని 1.45 గంటలకు డాక్టర్ చుంచు చలమయ్య రచించిన ‘నన్ను తీర్చిదిద్దిన ఉలిచి’ పుస్తకాన్ని మౌర్యా ఇన్లో జరిగే కార్యక్రమంలో ఆవిష్కరిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు నగరంలోని ఏ1 కన్వెన్షన్లో జరిగే ఆత్మీయ సమావేశానికి హాజరవుతారు. అక్కడ ఆయనకు సన్మానం ఉంటుంది. తిరిగి 6.45కు మౌర్యా ఇన్కు చేరి రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం 6 గంటలకు రైలులో చెన్నై బయలుదేరి వెళ్తారు. కాగా వెంకయ్యనాయుడు పాల్గొనే కార్యక్రమాల్లో కీలకమైన ఆత్మీయ సమావేశం, అలాగే త్రోవగుంట వద్ద ఘనస్వాగతం పలికేందుకు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నేతృత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ1 పంక్షన్ హాలు వద్ద ఏర్పాట్లను గురువారం సాయంత్రం దామచర్ల పరిశీలించారు. మరోవైపు బీజేపీతోపాటు పలు ఇతర పార్టీలు, రైతు, ప్రజాసంఘాల నేతలు, నగర ప్రముఖులు వెంకయ్యనాయుడును కలిసేందుకు సిద్ధమవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa