ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయ కక్షతోనే అనూషకు నోటీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 10, 2022, 04:29 PM

తెలుగుదేశం పార్టీ నేత, సోషల్ మీడియా అక్టీవిస్ట్  ఉండవల్లి అనూషకు హైకోర్టులో ఊరట లభించింది. ఆమెకు అనంతపురం పోలీసులు ఇచ్చిన 41ఏ నోటీసులను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ఇటీవల ఉండవల్లి అనూషకు పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి వ్యతిరేకంగా.. సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేత చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన 41ఏ నోటీసులను ఏపీ హైకోర్టులో ఉండవల్లి అనూష సవాల్ చేశారు. పిటిషనర్ తరఫున లాయర్‌ పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతోనే అనూషకు నోటీసులిచ్చారని లాయర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. న్యాయవాది వాదనలతో ఏపీ హైకోర్టు ఏకీభవిస్తూ.. 41ఏ నోటీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa