ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్టీ మహిళను కాబట్టే అవమానిస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 10, 2022, 04:31 PM

పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గంలో ఎస్టీ మహిళా సర్పంచ్‌కు వైసీపీ నేతల నుంచి వేదింపులు ఎదురవుతున్నాయి అని టీడీపీ నాయకులూ వాపోతున్నారు. అమరావతి సర్పంచ్‌గా ఎన్నికైన పాలపర్తి రాజేశ్వరి వైసీపీ నుంచి గెలుపొందారు. అయితే సర్పంచ్ స్దానంలో స్థానిక వైసీపీ నేతలు పెత్తనం సాగిస్తున్నారు. పంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్‌కే సీటు కేటాయించారని, తనపై ఉప సర్పంచ్ నిమ్మా విజయ సాగర్‌బాబు, వేములపల్లి నాగార్జున చౌదరిలు పెత్తనం చేస్తున్నారని రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి నాగరాజు కూడా తనకు గౌరవం ఇవ్వడం లేదని రాజేశ్వరి అన్నారు. వాళ్ళు చెప్పిన చోట సంతకాలు పెట్టాలని వేదిస్తున్నారని, ఎస్టీ మహిళను కాబట్టే తనను అవమానిస్తున్నారని వాపోయారు. దీనిపై జిల్లా అధికారులు స్పందించాలని కోరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa