సంక్షోభం లో ఉన్న చెరుకు పరిశ్రమను కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం సరికాదని రైతు సంఘ నాయకులు బుడితి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి చెరకు రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చాక కేవలం కమిషన్ వేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం టన్నుకు 3, 050 రూపాయలు మద్దతును ప్రకటించినప్పటికీ పెరిగిన వ్యవసాయ పెట్టుబడులు నేపథ్యంలో రైతుకు ఏ మాత్రం కూడా గిట్టుబాటు కావడం లేదని, కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా సరి అయిన మద్దతు ధరని ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. క్రషింగ్ కు ముందు పారిస్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ధర ప్రకటించాలని ఆయన కోరారు. చెరకుపరిశ్రమ ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుందని పరిశ్రమకు జీవం పోయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉందని గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa